- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్ లోని ఓ రెండంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో భవనంలో చిక్కుకున్న వారిలో ఏడుగురు మరణించగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
7 dies after fire broke out in Madhya Pradesh
- Advertisement -