- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయపడుతున్నాయి. గత 24 గంటల్లో 77,266 కొత్త కోవిడ్-19 కేసులు, 1,057 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కోవిడ్ కేసులు 33,87,501కి పెరిగాయి. వీటిలో 7,42,023 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 25,83,948 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 61,529 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు విడిచినట్టు ఆరోగ్య శాఖ తాగాజా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. భారత్ లో నిన్న పరీక్షించిన 9,01,338 నమూనాలతో సహా ఆగస్టు 27 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 3,94,77,848కి చేరినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.
77266 new covid 19 cases 1057 deaths in india
- Advertisement -