హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల 50 వేల 526 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రిపుల్ ట్రీ(టెస్టింగ్, ట్రెసింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సమర్ధవంతంగా అమలు చేయడంతోనే వైరస్ తీవ్రత అదుపులో ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం 41,646 టెస్టులు చేయగా మరో 873 పాజిటివ్లు తేలాయి. వీటిలో వీటిలో జిహెచ్ఎంసి పరిధిలో 152 మంది ఉండగా ఆదిలాబాద్లో 8, భద్రాద్రి 58, జగిత్యాల 36, జనగాం 8, భూపాలపల్లి 10, గద్వాల 4, కామారెడ్డి 11, కరీంనగర్ 44,ఖమ్మం 29, ఆసిఫాబాద్ 2, మహబూబ్నగర్ 20, మహబూబాబాద్ 13, మంచిర్యాల 22, మెదక్ 10, మేడ్చల్ మల్కాజ్గిరి 78, ములుగు 18, నాగర్కర్నూల్ 13, నల్గొండ 47, నారాయణపేట్ 2, నిర్మల్ 4, నిజామాబాద్ 13, పెద్దపల్లి 22, సిరిసిల్లా 18, రంగారెడ్డి 71, సంగారెడ్డి 27, సిద్ధిపేట్ 18, సూర్యాపేట్ 22, వికారాబాద్ 5, వనపర్తి 8, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ లో 56, యాదాద్రిలో మరో 14 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,63,526కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,50,453 కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.
51 లక్షలు దాటిన కరోనా టెస్టులు….
రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 51 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 51,34,335 మందికి కోవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల మందిలో ఏకంగా లక్షా 37 వేల 945 మందికి కోవిడ్ టెస్టులు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు హెల్త్ డిపార్ట్మెంట్ వివరించింది. అదే విధంగా ప్రతి రోజూ నిర్వహించే టెస్టుల్లో 98 శాతం శాంపిల్స్ను ప్రభుత్వ కేంద్రాల్లో నిర్ధారిస్తున్నామని అధికారులు తెలిపారు. రోజువారీ నిర్వహించే టెస్టుల్లో 44 శాతం ప్రైమరీ కాంటాక్ట్లకు, మరో 12 శాతం సెకండరీ కాంటాక్ట్లకు టెస్టులు చేస్తున్నామని ఆరోగ్యశాఖ నివేదించింది.