Monday, April 29, 2024

రెండు లక్షల 60వేలకు చేరువలో కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

948 new covid 19 cases five deaths in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 60 వేలకు చేరవయ్యాయి. మంగళవారం 42,433 మందికి టెస్టులు చేయగా 948 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 154 మంది ఉండ గా,ఆదిలాబాద్‌లో 14, భద్రాద్రి 61, జగిత్యాల 27, జనగాం 9, భూపాలపల్లి 14, గద్వాల 8, కామారెడ్డి 25, కరీంనగర్ 55,ఖమ్మం 44, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 11, మహబూబాబాద్ 11, మంచిర్యాల 26, మెదక్ 15 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 83, ములుగు 18, నాగర్‌కర్నూల్ 16, నల్గొండ 45, నారాయణపేట్ 4, నిర్మల్ 10, నిజామాబాద్ 13, పెద్దపల్లి 22, సిరిసిల్లా 9, రంగారెడ్డి 76, సంగారెడ్డి 38, సిద్ధిపేట్ 22, సూర్యాపేట్ 24, వికారాబాద్ 14, వనపర్తి 11, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ లో 40, యాదాద్రిలో మరో 12 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ఐదుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,59,776కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,45,293కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

2,45,293 మంది కోలుకున్నారు…

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు ఏకంగా 2,45,293 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. దీంతో రికవరీ శాతం కూడా 94.42 శాతానికి పెరిగిందని అధికారులు ప్రకటించారు.

1415కి చేరిన కోవిడ్ మరణాల సంఖ్య…

కరోనా వైరస్ దాడిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1415 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం పేర్కొంది. వీరిలో 44.96 శాతం మంది కేవలం కోవిడ్ 19తో చనిపోగా మరో 55.04 శాతం మంది కో మార్పిడ్ కండీషన్‌తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

ప్రతి పది లక్షల మందిలో లక్షా 33 వేల మందికి పరీక్షలు…

రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో లక్షా 33 వేల, 595 మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. వీటిలో 44 శాతం ప్రైమరీ కాంటాక్ట్‌లు, మరో 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లు కూడా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ వివరించింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టెస్టుల సంఖ్య 49 లక్షల 72 వేల 407 సంఖ్య దాటింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News