Friday, May 17, 2024

ప్రయాణికులే ఆర్‌టిసికి జీవనాధారం

- Advertisement -
- Advertisement -

RTC

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ(టిఎస్‌ఆర్‌టిసి)కి ప్రయాణికులే జీవనాధారం, ప్రయాణికుల ఆశీస్సులే సంస్థ మనుగడకు బలం అనే నినాదం మొబైల్ మైకు ప్రచార కార్యక్రమాన్ని మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. స్వయంగా సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లోని గురుద్వార్ బస్సు స్టాఫ్ కేంద్రం వద్ద మొబైల్ మైకు ద్వారా229 రూట్ లో ప్రయాణికులు బస్సును ఎక్కాలని అనౌన్స్ మెంట్ చేశారు. ఆర్‌టిసి బస్సు ప్రయాణం సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేస్తాయని ప్రయాణికులకు ఆయన వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రయాణికుల్లో స్పూర్తిని నింపుతాయని పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ యుగంథర్ తదితరులు పాల్గొన్నారు.

Passengers is strength for RTC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News