Monday, April 29, 2024

నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి

- Advertisement -
- Advertisement -
  • లాంగ్ పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి
  • పెండింగ్ కేసులపై , ఫంక్షనల్ వర్టికల్ , నాన్ బెలబుల్ వారెంట్‌పై సమీక్షా: సిపి శ్వేత

సిద్దిపేట: నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని సిపి శ్వేత అన్నారు. బుధవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలోదుబ్బాక డివిజన్ పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసులలో నేరస్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. రౌడీ,కేడి, డిసి , సస్పెక్ట్ ల, సంఘ విద్రోహశక్తుల వివరాలను టీఎస్‌కాప్‌లో పొందుపరిచి ప్రతిరోజు వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ విపిఓ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. 2020-21 సంవత్సరంలో పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసులలో త్వరగా పరిశోదన చే సి చార్జి షీట్ దాఖలు చేయాలని అండర్ ఇన్వెస్టగేషన్‌లో ఉన్న కేసులలో అన్ని కోణాల్లో త్వరితగతిన ఇ న్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషిట్ దాఖలు చే యాలన్నారు.

దొంగతనాల కేసుల్లో ప్రతి రోజు కే సుల చేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆప్ యా క్షన్ ఎస్‌ఓపి ప్రకారం,ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు చేదించాలన్నారు. సీసీ కెమెరాలను ప్రతి రోజు మానిటర్ చేయాలని పని చేయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌లో 7 ఇంటి గ్రేటెడ్ ఫార్మ అన్ని పూర్తి చేయాలని సూచించారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు , పాత నేరస్థులను తనిఖీ చేయాలని తెలిపారు. వర్టికలత్ వారిగా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు ప్రతి రోజు తనిఖీ చేసుకోవాలని, క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారీటి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, ఎసిపి దేవారెడ్డి, సిసి ఆర్బి ఏసిపి చంద్రశేఖర్,సిఐలు జానకి రామ్‌రెడ్డి, కృష్ణ, గురుస్వామి, ఎస్‌ఐలు, సిసిఆర్బి , ఐటికోర్ టీమ్ సిబ్బంది తదిరతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News