Monday, April 29, 2024

హెలికాప్టర్ కూలి యాక్సిస్ బ్యాంకు సీఈవో మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా లోని కాలిఫోర్నియా నెవడా సరిహద్దుల్లో హెలికాప్టర్ కూలి నైజీరియాకు చెందిన యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ విగ్వే, తన భార్య, కుమారుడు, సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నైజీరియాకు చెందిన ఎన్‌జీఎక్స్ గ్రూపు మాజీ ఛైర్మన్ అబింబోలా , ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. వీరంతా యూరోకాప్టర్ ఈసీ 130లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా, శాన్ బ్రెనార్డినో కౌంటీ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ దాదాపు 3000 అడుగుల ఎత్తు నుంచి కుప్ప కూలింది.

సమీపం లోని ఐ 15 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు ఈ ప్రమాదాన్ని గమనించి 911కు కాల్ చేశారు. ఎఫ్‌ఎఎ ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. సీఈవొ హెర్బర్ట్ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. నైజీరియా యాక్సెస్ బ్యాంక్ ఆఫ్రికా లోని పలు దేశాల్లో సేవలు అందిస్తోంది. ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి ఇది పెద్దషాక్ అని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవాలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికా లోని శాన్‌డియాగో వద్ద ఇటీవలనే ఓ సైనిక హెలికాప్టర్ కుప్ప కూలి ఐదుగురు మెరైన్‌కోర్ సిబ్బంది చనిపోయిన సంగతి తెలిసిందే . ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News