హైదరాబాద్: సంక్రాంతి బరి నుంచి ‘భీమ్లా నాయక్’ సినిమా తప్పుకుంది.ఈ సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే థీయేటర్ల సమస్య వస్తుందని ప్రడ్యూసర్ దిల్ రాజు అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ సినిమాను వాయిదా వేయాలని హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత రాధాకృష్ణలను కోరామని, అందుకు వారు అంగీకరించారని దిల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు వారికి ధన్యావాదాలు చెప్పారు. ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న శివరాత్రి రోజున విడుదల అవుతుందని దిల్ రాజు అన్నారు. చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, థియేటర్ల క్రాస్ రాకుండా ఒక్కో సినిమాకు డేట్స్ సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు. దయచేసి అందరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
‘Bheemla Nayak’ to release on Feb 25th