Monday, April 29, 2024

ఘట్‌కేసర్ రేప్ కేసులో ట్విస్ట్.. పోలీసులను తప్పు దారి పట్టించిన విద్యార్థిని..

- Advertisement -
- Advertisement -

బిఫార్మసీ విద్యార్థిని ‘తప్పు’ దారి పట్టించింది
గంజాయి సేవించి ప్రియుడు, స్నేహితులతో గడిపింది
తల్లి తరచూ ఫోన్ చేయడంతో కిడ్నాప్, అత్యాచారం డ్రామా
సిసి కెమెరాల ఫుటేజీలతో బయటపడ్డ బండారం
గంజాయి మత్తులో అన్ని వివరాలు వెల్లడించిన విద్యార్థిని

Raped and strangled on 18 years dalit woman

మనతెలంగాణ/హైదరాబాద్ (కీసర, ఘట్‌కేసర్): ఘట్‌కేసర్ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఫార్మసీ విద్యార్థిని తన అత్యాచారం జరిగినట్లు డ్రామా అడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గంజాయి మత్తులో యువతిని ప్రశ్నించిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. తనపై అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులతో పాటు తల్లిని తప్పుదోవ పట్టించినట్లు వెల్లడైంది. కాగా ఫార్మసీ కాలేజీ నుంచి ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లి అక్కడ ద్విచక్ర వాహనంపై తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఆ తర్వాత అతని ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి సేవించింది. అనంతరం విద్యార్థిని అనుమతితో ప్రియుడితో పాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది
తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో:
ప్రియుడు, అతని సోదరులతో సదరు ఫార్మసీ విద్యార్థిని గడుపుతున్న క్రమంలో తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని డ్రామా మొదలెట్టింది. దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు డయల్ 100కు ఫోన్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో సైరన్లు వినిపించడంతో భయపడిన యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు. దీంతో గస్తీ కాస్తున్న పోలీసులకు యువతి తారసపడింది. మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం యువతిని ప్రశ్నించగా.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది. ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకొన్నట్లు సమాచారం.
పోలీసులనూ తప్పుదారిః
ఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారంటూ అటు పోలీసులను, ఇటు కుటింబీకులను తప్పుదారి పట్టించింది. ఈక్రమంలో విద్యార్థిని అపహరణకు గురైందని, అలాగే అత్యాచారం జరిగిందన్న సమాచారం అందుకున్న పోలీసులు కూడా మెరుపు వేగంగా స్పందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెట్రోలింగ్ చేయడంతో ఫార్మసి విద్యార్థిని ప్రియుడు, అతని సోదరులు ఆమెను వదిలి పరారయ్యారు.
సిసి ఫుటేజీలతో డ్రామాకు చెక్:
గంజాయి మత్తులో ఉన్న విద్యార్థిని తనపై అత్యాచారం జరిగిందని యువతి తప్పుదారి పట్టించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నాగారం చౌరస్తా వద్ద ఆటో ఎక్కిన యువతి రాంపల్లి సమీపంలో దిగిపోయినట్లు గుర్తించారు. రాంపల్లిలో ద్విచక్ర వాహనంపై వేచి ఉన్న ఇద్దరు యువకులతో కలిసి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఎక్కడికి వెళ్లింది?అక్కడి నుంచి యువతి ఎక్కడికి వెళ్లిందనే కోణంలో పోలీసులు వివరాలు సేకరించారు. చీకటి పడినా కళాశాల నుంచి కుమార్తె ఇంటికి రాకపోవడం వల్ల యువతి తల్లి పదేపదే ఫోన్ చేసింది. తనను ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు యువతి, తల్లికి చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆందోళనకు గురైన తల్లి డయల్ 100కు ఫోన్ చేయగా అప్రమత్తమైన పోలీసులు నాగారం చౌరస్తా నుంచి ఘట్‌కేసర్ వరకు ప్రధాన రహదారిని జల్లెడపట్టారు.ఆ ఇద్దరు ఎవరు?యంనంపేటకు కొంత దూరంలో ఉన్న యువతిని గుర్తించిన పోలీసులు ఆమెను సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తనపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు ఆ యువతి పోలీసులు, వైద్యుల వద్ద తెలిపింది. అయితే సిసి కెమెరాల్లో ఆమె ద్విచక్ర వాహనంపై వెళ్లడంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించాచారు. యువతి ద్విచక్ర వాహనంపై ఎక్కడికి వెళ్లింది? యంనంపేట రహదారి సమీపంలోకి ఎలా వచ్చిందనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన ఇద్దరు యువకులెవరనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Big twist in Ghatkesar Pharmacy Student Rape Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News