Monday, April 29, 2024

బిజెపి అభ్యర్థికి బాధిత మహిళ ఝలక్

- Advertisement -
- Advertisement -

Campaigning to not vote for Raghunandan Rao

 

రఘునందన్‌రావుకు ఓటు వద్దంటూ ప్రచారం

ఇంటింటికీ తిరిగి తనకు జరిగిన అన్యాయం వివరిస్తున్న వైనం

మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో బిజపి అభ్యర్థి రఘునందన్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన రాధారమణి తాజాగా బిజెపికి ఓటు వేయొద్దంటూ ఇంటింట ప్రచారం చేపడుతోంది. గతంలో రఘునందన్‌రావు తనకు మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడంటూ వార్లల్లో నిలిచిన రాధారమణి దుబ్బాక ఉపపోరు సమయంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు దుబ్బాక బరిలో నిలిచిన రఘునందర్‌రావుకు తన అనుచరులు రూ. 40 లక్షల రూపాయలతో పోలీసులకు పట్టుబడగా, మరోవైపు తన లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ రాధారమణి అనే మహిళ రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరుగుతూ రఘునందన్ తనకు చేసిన అన్యాయాన్ని మహిళలకు చెబుతూ అతనికి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇటు పోలీసులను, అటు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించినా తన మాత్రం న్యాయం జరగలేదని దుబ్బాక ఓటర్ల ముందు వాపోతోంది.

ఈ ఎన్నికల్లో రఘునందన్‌రావును ఓడించడమే తన లక్షమని రాధారామణి ప్రచారం చేపడుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా రాధారమణి గత ఫిబ్రవరిలో ఓకేసు నిమిత్తం న్యాయవాది రఘునందన్‌ను ఆశ్రయిస్తే తనకు మత్తుమందిచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించిన విషయం విదితమే. రఘునందన్‌రావు తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లు ఆమె సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ అప్పట్లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె రఘునందన్‌రావు నుంచి తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా సమావేశంలో మాట్లాడారు.

రఘునందన్‌రావు తనను, తన కుమారుడిని హత్య చేయాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అంతటితో ఆగకుండా రఘునందన్‌రావు ఓ ప్రముఖ హీరో సోదరుడికి అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. అదేవిధంగా ముంబై కేంద్రంగా రఘునందన్ అమ్మాయిలను సరఫరా చేస్తున్నాడని ఇందుకు ఆర్‌సిపురం సిఐ రాజేశేఖర్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావుతో కలిసిన రఘునందన్ అమ్మాయిల బిజినెస్ చేస్తున్నారని ఆరోపణలు చేసింది.ఆమె తాజాగా దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కాగా రాధారమణి ప్రచారంపై రఘునందర్‌రావు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది ప్రత్యర్థుల కుట్రగా పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News