Monday, April 29, 2024

టీమిండియాపై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్ టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు భారత జట్టు విజయాన్ని కొనియాడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అసాధారణ ఆటతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, షమిలను వారు ప్రశంసలతో ముంచెత్తారు. భారత క్రికెట్‌కు ఈ విజయం కొత్త దిశను చూపడం ఖాయమని జోస్యం చెప్పారు. క్లిష్ట సమయంలోనూ ఒత్తిడికి గురికాక పోవడం ఈ పోరులో విజయం సాధించిన తీరును వారు కొనియాడారు. లార్డ్ మైదానంలో చారిత్రక గెలుపును అందుకున్న కోహ్లి సేనను వారు అభినందించారు. రానున్న మ్యాచుల్లో కూడా ఇలాంటి విజయాలే అందుకోవాలని ఆకాంక్షించారు. బుమ్రా, షమి, ఇషాంత్, సిరాజ్‌ల బౌలింగ్ చాలా అద్భుతమని వారు పేర్కొన్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేయడం ద్వారా వారు సత్తా ఏమిటో ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్, సెహ్వాగ్, అగార్కర్, అజారుద్దీన్, గవాస్కర్, మంజ్రేకర్ తదితరులు భారత జట్టును అభినందించిన వారిలో ఉన్నారు.

Celebrities and Ex Cricketers praise on Team India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News