Monday, April 29, 2024

కేంద్రం నుంచి రావలసిన నిధులకు గండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ కేటాయింపుల్లో అంచనాలు తారుమారు అయ్యాయి. ఆ విధంగా జరగలేదు. ఈ నేపథ్యంలో 2021..2022 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రానికి సుమారుగా రూ.10వేల కోట్ల మేరకు గండిపడిందని తెలుస్తోంది. దీంతో మార్చిలో రాష్ట్ర ప్రభు త్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కేంద్రం నుంచి మొత్తంగా రూ. 43వేల కోట్లకుపైగా వస్తాయని అంచనా వేసింది. కానీ తాజా బడ్జెట్‌లో కేంద్రం మన రాష్ట్రానికి రూ.34వేల కోట్ల మేరకు కేటాయించినట్లుగా రాష్ట్ర ఆర్ధిక శాఖ విశ్లేషిస్తోంది. ఇదిలావుంటే గత ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా, గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి రూ.30,308 కోట్లు కేటాయించింది. ఆశించినంత ఆదాయం రాలేదని సవరించిన బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కోత పెట్టింది. గత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా దక్కేది కేవలం రూ.4 కోట్లు మాత్రమేనని ఆర్ధిక శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర సర్కారు పదే పదే విజ్ఞప్తి చేసిన మిషన్ భగీరథకు ఆర్థిక సాయం అందించాలని ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం ఆశలు రేకెత్తించింది. ఈ స్కీమ్‌కు రూ.2,350 కోట్లు సాయం అందనున్నట్లుగా తెలుస్తోంది. ఇక అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద రూ.1,665 కోట్లు రానున్నాయి. గతంతో పోలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా నిధులు కాస్త తగ్గినా.. జిఎస్‌టి పరిహారం అందనుంది. కొత్తగా హెల్త్ గ్రాంట్‌ను ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడంతో మరిన్ని నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. అలాగే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.2,037 కోట్ల గ్రాంట్ రిలీజ్‌ చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేకంగా రూ.354 కోట్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌సాయం కింద రూ.599 కోట్లు కేటాయించారు. గ్రామీణ సడక్ యోజన, జ్యుడిషియరీ, స్పెషల్ గ్రాంట్లుగా మరో రూ.132 కోట్లు విడుదలకానున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో కేంద్రం ఈసారి పబ్లిక్ హెల్త్‌కు బడ్జెట్లో ప్రయారిటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి రూ.419 కోట్ల హెల్త్ గ్రాంట్ దక్కనుందని తెలుస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
జిఎస్‌టితో ఊరట
ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటా(టాక్స్ డెవల్యూషన్)తోపాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌ల నిధులు రాష్ట్రాలకు చేరనున్నాయి. సెంట్రల్ జిఎస్‌టి, ఇన్‌కమ్ ట్యాక్స్, సిజిఎస్‌టి, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, కార్పొరేట్ ట్యాక్సుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు రూ.6.65 లక్షల కోట్లను పంపిణీ చేయనుంది. ఇందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102 శాతం నిధులు అంటే సుమారుగా రూ.13,990 కోట్లు రాష్ట్ర ఖజానాకు రానున్నాయి. 2021..20–22 ఆర్ధిక సంవత్సరంలో జిఎస్‌టి పరిహారం కింద రాష్ట్రానికి రూ.2,136 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్‌సిఫార్సు చేసింది. ఈ మేరకు అదనంగా తెలంగాణకు నిధులు రానున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌ల కింద రూ.10,900 కోట్లు వస్తాయని ఆర్ధిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర గ్రాంట్ల రూపంలో మరో రూ.3,541 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.

Center allocated Rs 34000 cr to Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News