Friday, May 3, 2024

ఏడిద గోపాలరావు మృతికి సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns the death of Edida Gopala Rao

హైదరాబాద్: రేడియో న్యూస్ రీడర్‌గా ప్రజలకు చిరపరిచితుడైన ఏడిద గోపాలరావు మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. రేడియో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడుగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతులు సంపాదించారని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాల కార్యక్రమాలకు ఆయన ఇతోధిక సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. ఏడిద గోపాలరావు కుటుంబసభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CM KCR mourns the death of Edida Gopala Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News