Sunday, April 28, 2024

తెలంగాణ బిజెపి నాయకులు డమ్మీలు

- Advertisement -
- Advertisement -

Congress MLA Jagga Reddy comments on bjp leaders

బండి సంజయ్ బకరా నెం.1, ఈటల రాజేందర్ బకరా నెం.2
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ధ్వజం

హైదరాబాద్: తెలంగాణ బిజెపి నాయకులు డమ్మీలని.. బండి సంజయ్ బకరా నెం.1, ఈటల రాజేందర్ బకరా నెం.2 అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ బిజెపి నాయకత్వంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. పవర్ అంతా ఢిల్లీ చేతిలోనే వుందని.. రాష్ట్ర బిజెపి కమిటీకి పవర్ లేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్, బిజెపిలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ నుంచి ఏడేళ్లుగా ఎన్ని నిధులు తెచ్చారో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌ఎ రాజాసింగ్ ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. రాజాసింగ్‌కు బిజె పిలోనే విలువ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదులు సర్వసాధారణమని, ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

తెలంగాణకు అన్యాయం చేశారు: మల్లు రవి

తెలంగాణకు అన్యాయం చేశారని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు కోసం తెలంగాణ బిల్లులో పెట్టారని, ఏడేళ్లల్లో వాటి ఏర్పాటు కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఇవన్నీ చేస్తే ఎంతో మంది దళిత గిరిజనులకు న్యాయం జరిగిందన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చి ఈ పనులు ఎందుకు చేయలేదని మల్లు రవి నిలదీశారు. ఈ విషయాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మల్లురవి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News