Monday, April 29, 2024

వినియోగదారుడే మన దైవం: సిఎండి రఘుమా రెడ్డి

- Advertisement -
- Advertisement -

Consumer is my god

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలోని జోనల్, సర్కిల్, డివిజన్, సబ్-డివిజన్ కార్యాలయాల్లో, ఇఆర్ఒ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా మెట్రో జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యుత్ అంబుడ్స్ మెన్ నాగరాజు, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

సిఎండి జి రఘుమా రెడ్డి మీడియాతో మాట్లాడారు. వినియోగదారుడు సంస్థకు భగవంతుడు లాంటి వారని, వారికి సంతృప్తికర సేవలు అందించినప్పుడే సంస్థకు మనుగడ ఉంటుందన్నారు. వినియోగదారుడు సంస్థపై ఆధారపడలేదని, మనమే వారిపై ఆధారపడ్డామనే విషయం దృష్టిలోపెట్టుకుని వివిధ సేవల కోసం తమ వద్దకు వచ్చే వినియోగదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి, అధికారులను సూచించారు. వినియోగదారుల సౌకర్యార్ధం సంస్థ ఎప్పటికప్పుడు నూతన పద్ధతులు ప్రవేశపెడుతున్నదని, నూతన సర్వీసుల మంజూరు, పేరు మార్పు, బిల్లింగ్ సవరణ వంటి వివిధ సేవల కోసం సంస్థ వెబ్ సైటు ఆప్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు, గౌరవ విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి తోడ్పాటుతో అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా గావిస్తున్నామన్నారు. రాష్ట్రము ఏర్పడినప్పటి నుండి విద్యుత్ పంపిణి వ్యవస్థ పటిస్టీకరణ కోసం సంస్థ పరిధిలో రూ. 11,855 కోట్ల వ్యయంతో వివిధ పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుండి విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, 2014 లో 4989 మెగావాట్లుగా నున్న గరిష్ట డిమాండ్ 8474 మెగా వాట్లకు పెరిగిందని తెలియజేశారు. 101.72 మిలియన్ యూనిట్లుగా నున్న విద్యుత్ వాడకం 180.51 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు.

విద్యుత్ అంబుడ్స్ మెన్ నాగరాజు మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల శ్రేయస్సు కోసం వివిధ హక్కులు కల్పించబడ్డాయని, సరఫరా బిల్లింగ్, విద్యుత్ సంబంధిత పనుల్లో ఎలాంటి జాప్యం ఏర్పడ్డాయని ” కన్స్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరమ్ ” కు ఫిర్యాదు చేయగలరని, ఒక వేళ సమస్య పరిష్కారం కాకుంటే విద్యుత్ అంబుడ్స్ మెన్ అప్పీల్ చేసుకునే సదుపాయం ఉన్నదన్నారు. విద్యుత్ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు కీలకమని, పౌర సేవ పత్రం ప్రకారం విధులు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వినియోగదారులు పాల్గొని సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. తాజ్ బంజారా చీఫ్ ఇంజనీర్ ఎంఎల్ శర్మ మాట్లాడారు. రాష్ట్రము ఏర్పడ్డాక నిరంతర విద్యుత్ సరఫరా అందుతున్నదని హెచ్ టి వినియోగదారుల సమస్యలు వెంటనే పరిష్కరింప బడుతున్నాయన్నారు. మరో వినియోగదారుడు కృష్ణ మాట్లాడారు. సంస్థ ప్రవేశ పెట్టిన ఆన్లైన్ పద్దతి చాలా సౌకర్యంగా ఉన్నదన్నారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు కె రాములు, ఎస్ స్వామి రెడ్డి, సిజిఎం మెట్రో జోన్ నరసింహ స్వామి, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వినియోగదారులకు అందిస్తున్న వివిధ సేవల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపెరింటెండింగ్ ఇంజినీర్లు బ్రహ్మం, రవి కుమార్, ఖాజా అబ్దుల్ రహమాన్, చంద్ర శేఖర్, కామేష్, డివిజనల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News