Monday, April 29, 2024

పళనిస్వామికి క్షమాపణ చెప్పిన డిఎంకె ఎంపి ఎ.రాజా

- Advertisement -
- Advertisement -

DMK MP A. Raja apologized to Palaniswami

 

ఉదకమండలం: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామికి డిఎంకె ఎంపి ఎ.రాజా సోమవారం క్షమాపణలు చెప్పారు. ఆదివారం చెన్నైలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ పళనిస్వామి కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లిని కించపరిచేలా రాజా మాట్లాడారని చెబుతూ పళనిస్వామి ఉద్వేగానికి లోనయ్యారు. దాంతో, స్పందించిన రాజా ఆయనకు క్షమాపణలు చెప్పారు. తాను పళనిస్వామి మాతృమూర్తిని కించపరిచే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని రాజా వివరణ ఇచ్చారు. డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, పళనిస్వామిల రాజకీయ జీవితాల్ని పోల్చానని అన్నారు. తాను హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నానని రాజా అన్నారు. చట్టబద్ధంకాని సంబంధానికి పుట్టిన నెలలు నిండని బిడ్డ అంటూ పళనిస్వామిని ఉద్దేశిస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News