Wednesday, May 1, 2024

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 23.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ 35 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఓవర్లలో జాక్ క్రాలే, జానీ బైర్‌స్టోను అక్షర పటేల్ ఔట్ చేశాడు. ఇంగ్లాడ్ జట్టు పరుగులేమీ చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు బెన్ స్టోక్స్ (25), జోయ్ రూట్ (19), ఓలీ పోప్(12), డోమినిక్ సిబ్లే(07) పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్చర్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రైపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో బెన్ ఫోక్స్(03), జాక్ లీచ్ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో అక్షర పటేల్ నాలు వికెట్లు పడగొట్టగా అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News