Monday, April 29, 2024

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 105/1

- Advertisement -
- Advertisement -

England loss first wicket for 105 runs

కెన్నింగ్‌టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 44 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 263 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోరీ బర్న్, హసీబ్ హమీద్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. రోరీ బర్న్ 50 పరుగులు చేసి శార్థూల్ టాకూర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వికెట్‌పై ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో డావిడ్ మలాన్ (00), హామీద్(52) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 191

ఇండియా రెండో ఇన్నింగ్స్: 466

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్:290

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News