Monday, April 29, 2024

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 177/4

- Advertisement -
- Advertisement -

England loss four wickets for 177 runs

 

నాంటింగ్‌హామ్: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 58 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 177 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జోయ్ రూట్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రోరీ బర్న్ 18 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డోమినిక్ సిబ్లే 28 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. జాక్ క్రాలే ఆరు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఔటయ్యాడు. జానీ బయిర్ స్ట్రో 30 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇంగ్లాండ్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్(80), డానియల్ లారెన్స్ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 183
ఇండియా తొలి ఇన్నింగ్స్: 278

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News