- Advertisement -
కరీంనగర్: ఈటల రాజేందర్ తన పాదయాత్రలో శుక్రవారం అస్వస్థతకు గురికావడంతో ఆందోళన చెందిన ఆయన వీర అభిమాని సంగేమ్ శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందాడు. హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బిక్షపతి కొడుకు శ్రీనివాస్.. నిన్న ఈటల రాజేందర్ ఆరోగ్యం క్షిణించిందన్న వార్త విని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో మరణించాడని అతని తండ్రి బిక్షపతి తెలిపాడు. కాగా, గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఈటల అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Etela Rajender fan died with cardiac arrest
- Advertisement -