Monday, April 29, 2024

ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసు కేసులు

- Advertisement -
- Advertisement -

FIR against farmers over Red Fort Incident

న్యూఢిల్లీ: ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న(జనవరి 26) రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐబి చీఫ్, ఢిల్లీ పోలీస్ చీఫ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై నివేదికను సమర్పించారు. నిన్నటి ఘటనలో ఆందోళన చేసిన 200 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఐదుగురు రైతు నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆందోళనకారులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, తమపై కుట్ర జరిగిందని, మా ఆందోళనను ఆసాంఘిక శక్తులు హైజాక్ చేశాయని సంయుక్త కిసాన్ మోర్చ పేర్కొంది.

FIR against farmers over Red Fort Incident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News