- Advertisement -
అమరావతి: చిత్తూరు జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బోరు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ సింగరోలి జిల్లా చిత్రంగి తాలుకా దేవచ గ్రామవాసులుగా గుర్తించారు. ఈ దుర్ఘటన పెద్దతిప్పసముద్రం-కర్నాటక సరిహద్దులో చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
- Advertisement -