Monday, April 29, 2024

గుజరాత్‌లో వ్యానును ఢీకొన్న ట్యాంకర్: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five killed as tanker collides with van in Gujarat

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక వ్యానును ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. వతమాన్ నుంచి భావ్‌నగర్‌కు వెళ్లే మార్గంలో వలన గ్రామ సమీపంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆనంద్ జిల్లాలోని ఖంభట్‌కు వెళుతుండగా వ్యాను రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ట్యాంకర్ ఢీకొంది. వ్యానులోని నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి ఖంభట్‌లోని ఆసుతప్రికి తరలిస్తుండగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు వారు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News