Sunday, April 28, 2024

మాజీ సిఎం కెసిఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలి

- Advertisement -
- Advertisement -

అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై సిఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అధికారులను వాకబు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. కెసిఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు యశోద ఆసుపత్రి వద్ద భద్రత పెంచాలని రేవంత్ అధికారులకు సూచించారు. దీంతో అధికారులు ఆసుపత్రి వద్ద భద్రతను పెంచారు.

కెసిఆర్‌ను పరామర్శించిన జానారెడ్డి
తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సిఎం కెసిఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పరామర్శించారు.  జానారెడ్డి శుక్రవారం తన సతీమణి, తన కుమారుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ కెసిఆర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, కెసిఆర్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News