చెన్నై : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని యువతి బంధువులు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిమ్న కులానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి వన్నియార్ కులానికి చెందిన షర్మిళాను ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రుల పంచాయతీ పెట్టి బలవంతంగా ఆ జంటను వీడదీశారు. అంతేకాకుండా సుధాకర్ చంపుతామని బెదిరించడంతో అతడు చెన్నైకి పారిపోయాడు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ ప్రకటించడంతో సుధాకర్ తన సొంతూరుకు వచ్చాడు. ఇది గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు చంపాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం అమ్మాయి తండ్రి మూర్తి, బంధువు కథిరావణ్ అతడిని హత్య చేశారు. స్థానికులు సమాచారం మేరకు అరాణి తాలుక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్త స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Girl Friends relatives murder her Lover in Chennai