Monday, April 29, 2024

తెలంగాణకు నేషనల్ గేమ్స్ ఆతిథ్య హక్కులు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

ఐఓసి సిఈఓను కోరిన జగన్మోహన రావు
హెచ్‌సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్‌ను అభినందించిన కల్యాణ్ చౌబే

మన తెలంగాణ / హైదరాబాద్ : ఫుట్ బాల్ ఐ-లీగ్‌లో భాగంగా శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సి మ్యాచ్ కు హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన రావు విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని డెక్కన్ ఏరీనాలో నెరోకా ఎఫ్‌సి తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సి 4-0తో ఘన విజయం సాధించింది. తెలంగాణ ఫుట్ బాల్ సంఘం ఆహ్వానం మేరకు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లిన జగన్మోహన్ రావును హెచ్‌సిఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించినందుకు భారత ఒలింపిక్ సంఘం సిఈఓ కల్యాణ్ చౌబే ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా వీరి మధ్య జరిగిన భేటీలో నేషనల్ గేమ్స్ అంశం చర్చకు వచ్చింది. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో జాతీయ క్రీడలను నిర్వహించేందుకు తమకు అవకాశమివ్వాలని కల్యాణ్‌ను ఈ మేరకు జగన్మోహన రావు కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కల్యాణ్ త్వరలో శుభవార్త చెబుతామని జగన్మోహన రావుకు హామీ ఇచ్చారు. దీంతో పాటు 2028 ఒలింపిక్స్ క్రికెట్‌కు చోటు దక్కడంపైన, ఇటీవల ముంబైలో జరిగిన ఐఒసి సమావేశాల గురించి ఇరువురి భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో తెలంగాణ ఫుట్ బాల్ సంఘం కార్యదర్శి ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News