Monday, April 29, 2024

సాగునీటి నిర్వహణ, మరమ్మతు పనులను జిఎస్‌టి నుంచి మినహాయించాలి

- Advertisement -
- Advertisement -

మన హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే సాగునీటి నిర్వహణ, మరమ్మతుల పనులను జిఎస్‌టి నుంచి మినహాయించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ కోరారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో వర్చువల్‌గా పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప లు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జిఎస్‌టి నుంచి మినహాయింపులు ఇవ్వాలని కో రారు. తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలాశయాలు ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. ప్రతి ఏడాది వీటి ని ర్వహణ చేయడం ఎంతో ముఖ్యం. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తున్నది.

ఈ నిర్వహణ, మరమ్మతుల పనులను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వండి అని మంత్రి కోరారు. అదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలుకు జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే ఈ సేవలపై జి ఎస్‌టి వేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం ప డుతున్నదని, అందువల్ల జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశా రు. బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కేంద్రం బీడీ లపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగింది. దీన్ని గతంలో మేము తీవ్రంగా వ్యతిరేకించాం. బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.

అందువల్ల మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు కోరారు. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రపోజల్ స్వాగతిస్తున్నాం. అయితే దీనిపై ఉన్న సంశయాలను కౌన్సిల్ దృష్టికి తెస్తున్నాం. ముఖ్యంగా టెలికాం సేవలకు సంబంధించి, ట్రాయ్ రూల్స్ వల్ల కస్టమర్ అడ్రస్, పిన్ నెంబర్ పే టీఎం, మోబి క్విక్, బిల్ డెస్క్ తదితర ఆన్లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం ఉండదు. దీని వల్ల వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాలని కోరుతున్నాం. మైనర్ ఇరిగేషన్, పిడిఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, బీడీ ఆకులపై జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులపై జీఎస్టీ పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్‌మెంట్ కమిటీకి సిఫార్సు చేస్తూ ఆదేశించింది.

టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ కమర్షియల్ టాక్స్ నీతూప్రసాద్, వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News