Monday, April 29, 2024

పెళ్లైన ఐదు రోజులకే నవవరుడు మృతి

- Advertisement -
- Advertisement -

 


అమరావతి: పెళ్లైన ఐదు రోజులకు నవవరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో వధువు తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హోళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన మారేష్(23)తో హోళగుందకు చెందిన రేణుకకు ఈ నెల 17న పెళ్లి జరిగింది. ఆదివారం అమావాస్య కావడంతో సోమవారం తెల్లవారుజామున టోపి మారెమ్మను దర్శించుకునేందుకు నవ దంపతులు వెళ్లారు. దేవునికి పూజా చేసిన అనంతరం ఇంటికి వస్తుండగా సిద్ధాపురం గ్రామం వద్ద వెనక నుంచి అతి వేగంగా బైక్ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. వెంటనే వాహనదారులు వీరిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో నవ వరుడు చనిపోయాడు. వధువు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News