Monday, April 29, 2024

బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ల పార్టీ బిజెపి

- Advertisement -
- Advertisement -

ఆసరా….కళ్యాణ లక్ష్మి ఇచ్చే పార్టీ టీఆర్ఎస్.

ఏ పార్టీ కి మీ ఓటు.‌..

అమ్మాడాలు…..
కుదవ పెట్టడాలు…
ఉద్యోగం ఊడగొట్టడాలు…
ధరలు పెంచడం బిజెపి ఎజెండా… ప్రజల ఎజెండానే మా జెండా…..

కరీంనగర్: విశ్వకర్మ కులస్థుల వృత్తులు దెబ్బతింటుండటంతో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హుజురాబాద్ లో విశ్వకర్మ మనుమయ భవనం, రెండె కమ్యూనిటీ హాళ్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు శంకు స్థాపన చేశారు.  జమ్మికుంటలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ తో పాటు హుజురాబాద్ లో విశ్వకర్మ మనుమయ సంఘం కోసం ప్రొ.జయశంకర్ భవన్ పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని హరీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎకరం స్థలంలో కోటి నిధులతో ఈ భవనం నిర్మిస్తున్నామని, అవసరమైతే గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఫండ్స్, ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డికి వచ్చే నిధులు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. నిన్నటిదాకా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్.. కల్యాణ లక్ష్మి పథకాన్ని దండుగ అన్నారని, అలాంటి వ్యక్తికి ఓటేస్తారా? అని ప్రజలను అడిగారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కనుమరుగైందని, ఇక్కడున్నవి టిఆర్ఎస్, బిజెపి మాత్రమే పోటీలో ఉన్నాయన్నారు.

బిజెపి వాళ్లు బొట్టుబిల్లలు, గడియారాలు ఇస్తాం, ఓటేయమంటున్నారని. వీటితో మనం బతుకుతామా? అని అడిగారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బిజెపి నాయకులకు లేదని దుయ్యబట్టారు. బిసిలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదని హరీష్ మండిపడ్డారు. బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ పెట్టాలని, బిసిల జనగణన చేయాలంటే చేయడం లేదని,  ఇలాంటి వాళ్లు బిసిలకు న్యాయం చేస్తామంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ ధర పెంచితే సిలిండర్ కు దండం పెట్టి బీజేపీకి ఓటేయమని అప్పట్లో మోడీ చెప్పారని గుర్తు చేశారు.  ఇప్పుడు తాను కూడా అదే చెబుతున్నా సిలిండర్ కు దండంపెట్టి.. పోలింగ్ బూత్ కు వెళ్లి ధరలు పెంచిన బిజెపికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

బిజెపి వచ్చిన తర్వాత రైల్వే శాఖలో 2 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం, ధరలు పెంచడం తప్ప.. వీళ్లు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. విశ్వకర్మలు సంప్రదాయక ఇంజినీర్లు అని, వాళ్లు అద్భుత కళాఖండాలు సృష్టిస్తారని కొనియాడారు. విశ్వ బ్రాహ్మణులపై దొంగబంగారం కేసులు కాకుండా, వడ్రంగులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కార్పొరేట్ నగల వ్యాపారుల వల్ల స్వర్ణకారుల వృత్తి దెబ్బతిందని, స్వర్ణకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  ఈటల రాజేందర్ గెలిస్తే.. ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురవుతారు తప్ప.. ప్రజలకేం లాభంలేదన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చుకుందామని, ఇండస్ట్రీయల్ పార్కుల్లో విశ్వబ్రాహ్మణులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు.

సొంత జాగా ఉన్న వాళ్లకు విశ్వబ్రాహ్మణులకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. నిన్నటిదాకా పనిచేసిన మంత్రి నిర్లక్ష్యం వల్లే ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదని మండిపడ్డారు. 17 ఏళ్లుగా ఈటలకు అవకాశమిచ్చారని, ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. 17 ఏళ్లలో పూర్తి కాని పనులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి చూపిస్తామన్నారు. బిజెపి ఈ రాష్ట్రంలో అధికారంలో లేదని, వచ్చే అవకాశం లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బెజెపి కోతలు, వాతలు తప్ప మనకు చేసిందేమీ లేదని చురకలంటించారు. ఓటుకు 30 వేలు ఈటల రాజేందర్ ఇస్తానంటున్నాడటని, డబ్బులిచ్చే బదులు గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేలా చూస్తే మంచిదని హితువుపలికారు. త్వరలోనే విశ్వబ్రహ్మణులు శుభవార్త వింటారని, గతంలో తొలి స్పీకర్ అవకాశం మీ కులానికి చెందిన మధుసూదనాచారికి దక్కిందన్నారు. అలాంటి అవకాశం భవిష్యత్తులో మళ్లీ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రి పెద్ది రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News