Sunday, April 28, 2024

గజ్వేల్ లో క్రైస్తవ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: యేసు ప్రభువు సర్వ మానవ, సమానత్వం కోరారని, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని యేసు క్రీస్తు తన బైబిల్ బోధనలో చెప్పారని, అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వ మతాలను గౌరవిస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలం ఇచ్చి ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం నిర్మించుకుని ప్రారంభం చేసుకున్నామని గజ్వేల్ నియోజకవర్గ క్రైస్తవులకు పవిత్ర క్రిస్మస్ మాస శుభాకాంక్షలను మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. జిల్లా గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలలో పాల్గొని, ఆ తర్వాత నియోజకవర్గ పరిధిలోని 3600 మంది పేద క్రైస్తవ లబ్ధిదారులకు దుస్తుల పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ యేటా క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సాయం అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చేయూత అందించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవులకు కమ్యూనిటీ భవనాలు జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేటలో నిర్మించుకుని వినియోగించుకుంటున్నట్లు, త్వరలోనే అన్నీ నియోజకవర్గ పరిధుల్లో కూడా వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

గజ్వేల్ లో చక్కటి క్రిస్టియన్ భవనాన్ని, అన్నీ రకాల అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించుకున్నట్లు, క్రైస్తవ పేదలందరికీ అనువయ్యే విధంగా ఈ భవనం నిర్వహణ ఉండాలని నిర్వాహకులను మంత్రి కోరారు. సర్వ మానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని ఆ యేసుక్రీస్తు తమ బైబిల్ బోధనలో చెప్పారని గుర్తు చేస్తూ.. అదే విధంగా సీఎం కేసీఆర్ సర్వమతాలను గౌరవిస్తారని, హిందూ దేవాలయాలు అభివృద్ధి జరగాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరే వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. పండుగ ఏదైనా ప్రభుత్వం అన్నీ మతాల వారిని కూడా సముచితంగా చూస్తూ.. క్రిస్మస్ పండుగకు కానుకగా దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు, మారుమూల గ్రామ ప్రాంతాల్లోని పేదలందరికీ క్రిస్మస్ కానుక బట్టలు అందేలా ఫాస్టార్లంతా చొరవ చూపాలని మంత్రి కోరారు. కరుణామయుడు దివి నుంచి భువికి దిగి వచ్చిన రోజును క్రిస్మస్ గా జరుపుకుంటున్నట్లు, ఈ మాసాన్ని క్రైస్తవ మాసంగా పేర్కొంటామని తెలుపుతూ.. ఈ పవిత్ర క్రైస్తవ మాసంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణం పూర్తి చేసుకుని, కొత్త భవనంలోకి వచ్చామని, అలాగే క్రైస్తవ సమాధిలకై 5 ఎకరాల్లో స్థలాన్ని కేటాయింపు చేస్తున్నట్లు, త్వరలోనే గజ్వేల్ లో హిందువులకు వైకుంఠ రథం తరహాలో క్రైస్తవులకు పరలోక యాత్ర వాహనాన్ని అందించే ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. నిర్వాహకుల కోరిక మేరకు భవనంలో పేద క్రైస్తవులకు పైసా ఖర్చు లేకుండా కల్యాణ లక్ష్మీ ఇస్తున్నట్లు, ఇతర ఖర్చులు కూడా కాకుండా క్రిస్టియన్ హాల్ లో అవసరమైన ఫర్నీచర్, హాల్ సామాగ్రి అందిస్తామని మంత్రి హామీ ఇచ్చి, ఇంకా ఏ సమస్యలు ఉన్నా దశల వారీగా పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

Harish Rao inaugurate Christian Bhavan in Gajwel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News