- Advertisement -
ఢిల్లీ: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నృత్యకారుడు సునీల్ కోఠారీ ఆదివారం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ముంబయిలో 1933 డిసెంబర్ 20న కోఠారీ జన్మించారు. ఓ ప్రైవేటు కంపెనీలో చార్టెడ్ ఎకౌంట్గా పని చేసినప్పటికి ఆసక్తి మేరకు భారతీయ నృత్య కళల వైపు అడుగులు వేశారు. నృత్య విభాగంలో చేసిన అద్భుతమైన సేవలకుగాను 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
- Advertisement -