Sunday, April 28, 2024

ప్రేమికుడితో కుమార్తె పెళ్లి… భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

Six brutally murdered in Visakhapatnam

చెన్నై: ప్రేమికుడితో కుమార్తెను పెళ్లి చేయడంతో భార్యను అతి కిరాతకంగా భర్త హత్య చేసిన సంఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నటరాజపురా గ్రామానికి చెందిన మునుస్వామి-లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్దు కుమార్తె పెళ్లి నిశ్చయం కావడంతో వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి రెండు రోజుల ముందు ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. మునుస్వామి తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ప్రేమికుడితో ఇంటికి వచ్చిన కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. వీరి వివాహం తన భార్య చేసి ఉంటుందని గ్రహించాడు. వెంటనే ఆమెను తూత్తుకుడి జిల్లా కొళత్తూరు సమీపంలోని దురైస్వామి పురం ఆలయ దర్శనానికి అంటూ భార్యను తీసుకెళ్లాడు. అడవి ప్రాంతంలో ఆమెను చంపేశాడు. ఎవరూ గుర్తు పట్టకుండా దహనం చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. ఎస్‌పి జయకుమార్, డిఎస్‌పి ప్రకాశ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News