- Advertisement -
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. పాజిటివ్ల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 26,382 పాజిటివ్ కేసులు నమోదుకాగా 387 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 99.32 లక్షలకు చేరుకోగా 1.44 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 94.56 లక్షల మంది కోలుకోగా 33 వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఛతీస్గఢ్ వంటి రాష్ట్రాలలో 56 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు భారత్లో 15.6 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.
India coronavirus active cases state wise
- Advertisement -