Sunday, April 28, 2024

నగరాల్లో భారీగా పెరిగిన ఒమిక్రాన్ ఉధృతి

- Advertisement -
- Advertisement -
India Omicron cases near thousand
వెయ్యికి చేరువైన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ, ముంబయిలలో ఒక్క రోజే 80 శాతానికి పైగా పెరిగిన కొవిడ్ కేసులు
8 రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ ఉధృతి ఒక్క సారిగాపెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో13 వేలకు పైగా కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య సైతం వెయ్యికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న 11 నగరాలను మరోసారి అప్రమత్తమయింది. మరణాలను తగ్గించాలంటే వైరస్ కట్టడికి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. అంతేకాకుండా ఢిల్లీలో అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్‌యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో కొవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ముంబయిలో కేవలం ఒక్క రోజులోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది.

ఒక్క రోజే 82 శాతం పెరిగి 2,510కి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోను 923 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే 86 శాతం పెరిగాయి. మరో వైపు కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ఇప్పటికే అక్కడ సామాజిక వ్యాప్తి జరిగిందేమోనన్న అనుమానాలను ఢిల్లీ ప్రభేత్వం వ్యక్తం చేసింది. వీటితో పాటుగా గుర్గావ్,చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయి సబర్బన్, పుణె, నాగపూర్ నగరాల్లో గత రెండు వారాల్లో కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ కట్టడికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో దేశీయంగా ప్రయాణాలు, పెళ్లిళ్లు, పండగలు, సెలవులు లాంటి వివిధ కార్యక్రమాలు పెరిగిన దృష్టాను కొన్ని చోట్ల విద్యా సంస్థలకు సెలవులు ముగియడం, లేదా కొనసాగుతున్న దృష్టా అప్రమత్తగా ఉండాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ హెచ్చరించారు.

అంతేకాకుండా శీతాకాలం ప్రారంభం కావడంతో కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం పెరిగినందున శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఇలాంటి సమస్యలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని కూడా ఆ లేఖలో సూచించారు. ఇక అత్యధిక వేగంగా వ్యాపిస్తున్నట్లు భావిస్తున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 22రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది. చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సంవత్సర వేడుకలపైనా ఆంక్షలు విధించేందుకు పలు రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News