- Advertisement -
మెల్బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు టీమిండియా 70 పరుగులు చేస్తే విజయం సొంతమవుతోంది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 103.1 ఓవర్లలో 200 పరుగులు చేసి ఆలౌటైంది. నాలుగో రోజు ఆసీస్ జట్టు 69 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బ్యాట్స్మెన్లు గ్రీన్ (45), కమ్నీస్(22) పరుగులు చేయడంతో రెండు వందల స్కోర్ను అందుకోగలిగింది. గ్రీన్, కమ్నీస్ ఏడో వికెట్పై 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మహామాద్ సిరాజ్, రవీచంద్రన్ అశ్విన్ చెరో మూడు వికెట్లు తీయగా జస్ప్రత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్ తొలి టెస్టులో గెలిచి 1-0తో ముందంజలో ఉంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195
భారత్ తొలి ఇన్నింగ్స్: 326
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 200
- Advertisement -