Saturday, April 27, 2024

ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

 ABV

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత కీలకమైన నిఘా పరికరాలను, వ్యవస్థలను కొనుగోలు చేశారన్న ఆరోపణలపై నివేదిక అందటంతో ప్రభుత్వం విచారణ చేపట్టాలని సూచించింది. ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడి సంస్థ నుంచే పోలీసు లు వినియోగించే కీలకమైన నిఘా పరికరాలను కొనుగోలు చేయించటం అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసులు వినియోగించే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్ ఉపకరణాలను ప్రైవేటు వ్యక్తులు, విదేశీ రక్ష ణ ఉత్పత్తుల తయారీ సంస్థ చేతుల్లో పెట్టటం వల్ల జాతీ య భద్రతకు తీవ్ర విఘాతం కలిగించారని ప్రభుత్వం తన నివేదికలో వివరించింది.

ముఖ్యంగా దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో నిబంధనల్ని అతిక్రమించారంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాతీయ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించేలా ఓ విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థకు పోలీసు సెక్యూరిటీ ప్రోటోకాల్ వ్యవస్థ వివరాలను అప్పగించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థతో వెంకటేశ్వరరావు కుమ్మక్కయ్యారని ఆయనపై మోపిన అభియోగాల్లో ప్రభుత్వం పేర్కొంది. విచారణలో ప్రాథమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని, ఉద్దేశపూర్వకంగా దేశ ద్రోహానికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ వద్ద కొనుగోలు చేసిన నాసిరకం పరికరాలు, రాష్ట్ర భద్రత వ్యవహారాలను, పోలీసులను ప్రమాదకరమైన స్థితిలో పడేశాయని ప్రభుత్వం వివరిస్తోంది. రాష్ట్ర రహస్యాలను ఇతరులు తెలుసుకునేలా ఉన్నాయని.

పోలీసులు భవిష్యత్తులో కొనుగోలు చేయనున్న వ్యవస్థలకు సంబంధించిన అంశాలు బహిర్గతం అయ్యేలా వెంకటేశ్వరరావు వ్యవహరించారని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా లాభపడేందుకు వెంకటేశ్వరరావు తన కుమారుడితో ఓ నకిలీ కంపెనీని ఏర్పాటు చేయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా నిఘా, భద్రత పరికరాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషన్ తదితర సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా వాటిని పాటించలేదని విచారణలో తేలాయని ఎపి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

అప్పట్లో ఎపి అదనపు డిజి -ఆపరేషన్స్, సిఐడి అదనపు డిజిలు అడిగిన వివరణలను వెంకటేశ్వరరావు ఖాతరు చేయాలేదని, వాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి అనతికాలంలో నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారులకు ఎపి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్ని అతిక్రమించినందుకు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా సస్పెన్షన్ కాలంలో వెంకటేశ్వరరావు ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Inquiry into ABV’s son’s businesses
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News