Wednesday, May 8, 2024

ముంబైపై పంజాబ్ విజయం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మ్యాచ్‌తో పాటు తొలి సూపర్ ఓవర్ టైగా ముగిసింది. దీంతో రెండో సూపర్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో పంజాబ్ జయకేతనం ఎగుర వేసింది. యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్‌లో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఒకే రోజు రెండు మ్యాచ్‌లు టై అయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ‌కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ కూడా టైగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కూడా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమమైంది. దీంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది.

IPL 2020: KXIP beat MI in 2nd Super Over

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News