Saturday, April 27, 2024

మేలో రానున్న పవన్ చిత్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శర్వానంద్, సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ‘జాను’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శర్వానంద్, సమంత, దిల్ రాజు, శిరీష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “జాను చిత్రం మంచి విజయం సాధించింది. హీరో హీరోయిన్లు శర్వానంద్, సమంతలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాను ఉగాది రోజున మార్చి 25న విడుదల చేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘పింక్’ రీమేక్ సినిమాను మేలో విడుదల చేస్తాం. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను మార్చిలో రిలీజ్ చేస్తాం” అని తెలిపారు.

Jaanu Movie Unit visits Tirumala

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News