- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడ్డ జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. జూలై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు, జూలై 26న నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ తెలిపారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఆగస్టులో నిర్వహిస్తామని, త్వరలోనే పరీక్ష తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం వాయిదా పడ్డ సీబీఎస్ఈ క్లాస్ టెన్త్, 12 బోర్డు పరీక్షలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
- Advertisement -