Monday, April 29, 2024

కరోనాతో ప్రముఖ జర్నలిస్టు ఆర్‌కె కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా వైరస్ అందరినీ బలి తీసుకుంటుంది. ప్రముఖులు కరోనా బారిన పడి చనిపోతున్నారు. సీనియర్ జర్నలిస్టు భళ్లపూడి రామకృష్ణ (ఆర్‌కె) కరోనాతో కన్నుమూశారు. గత వారం రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్స పొందుతున్న క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో బుధవారం ఉదయం చనిపోయారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతంలో ఆర్‌కె జన్మించారు. ఆర్‌కెకు భార్య, కుమారుడు ఉన్నాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటివి, ఎన్‌టివి, డెక్కన్ క్రానికల్ సంస్థలలో పని చేశారు. ఆర్‌కె మృతి పట్ల మీడియా ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి. మీడియా వర్గం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News