- Advertisement -
స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ వివాహం శుక్రవారం గౌతమ్ కిచ్లూతో సంప్రదాబయబద్ధంగా జరిగింది. తన ప్రియుడు గౌతమ్తో ఏడడుగులు వేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. లాక్డౌన్ కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి పెళ్లి వేడుక ముంబయ్లో ఘనంగా జరిగింది. కాజల్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన అందాల తార కాజల్ ‘మగధీర’ చిత్రంతో స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకుంది. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి హిట్ను అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, కమల్హాసన్తో ‘ఇండియన్–2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తోంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ తాజాగా చెప్పింది.
- Advertisement -