- Advertisement -
చిత్ర పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. నిర్మాతలు ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. సినిమాలు తీయాలంటే కరోనా భయం వెంటాడుతోంది. పెట్టుబడి తిరిగి వస్తుందన్న గ్యారెంటీ లేదు. దీంతో ఖర్చు అదుపులో పెట్టుకోవడం ఒక్కటే వాళ్ల ముందున్న ప్రధానమైన మార్గం. అలా చేయాలంటే తారలు పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో మహానటి కీర్తిసురేష్ తన పారితోషికాన్ని తగ్గించుకోవడం విశేషం. తన పారితోషికంలో 20 నుంచి 30 శాతం తగ్గిస్తున్నట్టు ఆమె ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్టా… నిర్మాతల శ్రేయస్సు, చిత్ర పరిశ్రమ మనుగడని దృష్టిలో పెట్టుకొని తాను పారితోషికం తగ్గించుకుంటున్నానని కీర్తిసురేష్ పేర్కొంది.
- Advertisement -