Monday, April 29, 2024

టీమిండియాపై మంత్రి కెటిఆర్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

 

KTR praise on Team India

మన తెలంగాణ/హైదరాబాద్: లార్డ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ భారత జట్టును అభినందించారు. గెలుపు నిజంగా అద్భుతం ‘రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్.. ఉత్కంఠ విజయం సాధించిందని మంత్రి కెటిఆర్ చేసిన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆహా.. ఏమి విజయం! అద్భుతమైన టెస్ట్ మ్యాచ్‌లో అమోఘమైన విజయం. టీమిండియా అదరగొట్టింది. మన పేసర్లకు అభినందనలు. ముఖ్యంగా మన హైదరాబాద్ సిరాజ్ మాయ చేశాడు. షమి, బుమ్రాబాల్‌తో పాటు బ్యాట్‌తోనూ మేజిక్ చేశారు. ఇషాంత్.. నిలకడగా ఆడాడు. ఇది టెస్ట్ మ్యాచ్‌లోని నిజమైన మజాను అందించింది. క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే కెటిఆర్.. భారత్ సాధించిన విజయాన్ని ఆస్వాదించానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News