- Advertisement -
హైదరాబాద్ : భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శతజయంతి సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు.. వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నానని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పివి జ్ఞాపభూమిలో ప్రధాన కార్యక్రమం జరుగనుంది. ఈ ఉదయం 10.30 గంటలకు పివి శత జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు.
- Advertisement -