- Advertisement -
కోల్కతా : తన హయాంలో పశ్చిమ బెంగాల్లో అవినీతి పెచ్చుమీరిందని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. భారత్లో సమ్మిళిత భావనను మంటగలిపిన వారిలో అమిత్ షా ఒకరని ఆమె మండిపడ్డారు. బెంగాల్ సంస్కృతి పునరుద్ధరణపై మాట్లాడుతున్న అమిత్ షాకు తన కళ్లెదుటే తన మనుషులు విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఎవరు పునరుద్ధరించారో తెలుసుకోవాలని మమతా బెనర్జీ మంగళవారం ట్వీట్ చేశారు. అమిత్షాను తిరస్కరించిన బెంగాల్ అనే హ్యాష్ట్యాగ్తో ఆమె తన ట్వీట్ను ట్యాగ్ చేశారు.
- Advertisement -