Sunday, April 28, 2024

కడుపు నొప్పితో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కడుపు నొప్పితో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం సిద్దిపేట అర్బన్ మండలం కృష్ణసాగర్ పరిధిలోని ఒడిసెల కుంట వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హాసింగ్ బోర్డు కాలనీ అరుందతి నగర్‌కు చెందిన బండపల్లి శివకుమార్ (28) శుక్రవారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకి కోసం వెతకగా కిష్టసాగర్ సమీపంలో ఒడిసెలకుంట చెరువు వద్ద మృత దేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ అనేక మందులు వాడినప్పటికి తగ్గకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News