ముంబయి: చనిపోయిన సోదరుడు దెయ్యం లాగా వచ్చి తనని చంపేస్తాడనే భయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తులసి రామ్ చావన్ (31) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నార్పోలి ప్రాంతంలో నివసిస్తున్నాడు. చావన్ తల్లిదండ్రులు చనిపోవడంతో తన సోదరుడితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లో తన సోదరుడు కూడా ఫిబ్రవరి 2న చనిపోయాడు. దీంతో చవాన్ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. ఒక రోజు రాత్రి తన సోదరుడు దెయ్యంలాగా వెంటాడుతున్నాడని, తనపై దాడి చేశాడని పక్కింటివాళ్లకు చెప్పాడు. దీంతో పక్కింటి వాళ్ల రాత్రి సమయంలో తమ ఇంట్లో పడుకోవాల్సిందిగా చవాన్ను కోరారు. చవాన్ రెండు రోజుల క్రితం ఐదు గంటలకు నిద్రలేచి బయటకు వెళ్లాడు. ఉదయం 7.30 గంటలకు ఇంటికి సమీపంలో అతడు చనిపోయినట్టు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి మృతదేహాన్ని పక్కింటి వాళ్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొంతు కోసుకొని చనిపోయాడా ? లేక ఎవరైన హత్యా చేశారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.