Sunday, April 28, 2024

భార్య శవం పక్కనే మూడు రోజులు…

- Advertisement -
- Advertisement -

Dead Body

 

 

కోల్‌కతా: చనిపోయిన భార్య మృతదేహం పక్కనే మూడు రోజులు గడిపిన ఒక వ్యక్తి ఉదంతం వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌లోని నడియా జిల్లా ఛక్డాలో శుక్రవారం ఈ సంఘటన బయటపడింది. 50వ దశకంలో ఉన్న భారతీ చందా అనే మహిళ కాలేయ వ్యాధితో కొద్దిరోజుల క్రితం మరణించింది. చివరిసారిగా ఆమెను సోమవారం చూసినట్లు పొరుగువారు పోలీసులకు తెలిపారు. మూడు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఆమె భర్త బచ్చు చంద్రను వారు గురువారం ప్రశ్నించారు. అయితే అతను ఇచ్చే సమాధానాలు పొంతన లేకపోవడంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో భారతి మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. భారతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు బచ్చు మానసిక స్థితిని అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

 

Man found living with wifes decomposed body, According to Bengal police the incident took place at Chakdah in Nadia district
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News