Monday, April 29, 2024

దారుణం.. నిద్ర మాత్రలు ఇచ్చి కూతురిపై కన్నతండ్రి అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

Rape womaMan rapes his daughter after giving sleeping pillsn by claiming to ward off evil forces

బెంగళూరుః నిద్ర మాత్రలు ఇచ్చి కన్న కూతురిపైనే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని హరలూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలోకి వెళితే.. ఈ నెల 23న తాను దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు తన తండ్రితో 19 ఏళ్ల కూతురు చెప్పింది. ఇదే అదునుగా భావించిన అతడు తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతుందని చెప్పి కూతురికి నిద్రమాతలు వేయించాడు. దీంతో నిద్రలోకి జారుకున్న కూతురిపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరునాటి ఉదయం నిద్ర లేచి చూసేసరికి తనపక్కలో తండ్రి పడుకొని ఉండటంతో జరిగిన విషయాన్ని ఆమె తెలుసుకుంది.

ఈ విషయాన్ని తన మరుతల్లికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో టాయిలెట్ శుభ్రం చేసే రసాయనాన్ని తాగి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన ఘోరాన్ని చెబుతూ ఆ బాలిక కుప్పకూలింది. వెంటనే పోలీసులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలిక ఫిర్యాదుతో కామాంధుడైన ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాలిక మరుతల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Man rapes his daughter after giving sleeping pills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News