Sunday, April 28, 2024

అమరుల సేవలు మరువం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Martyr's services are good

హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు నిత్యం స్మరనీయమన్నారు.  అక్టోబర్ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా అమరుల సేవలను మంత్రి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.  శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన పోలీస్ అమరుల సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరన్నారు. అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News